

ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి టీజీ సంస్థల నుంచి కోటి రూపాయలు విరాళం
విజయవాడ లో నిర్మిస్తున్న నూతన ఆర్యవైశ్య మహాసభ భవనానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖామంత్రి శ్రీ టీజీ భరత్ టీజీవి సంస్థల నుంచి 50 లక్షలు చెక్కులు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య గారికి అందజేయడం జరిగింది గతంలో కూడా ఈ భవన నిర్మాణానికి 50 లక్షలు ఇచ్చారు మొత్తం కోటి రూపాయలు ఈ భవన నిర్మాణానికి వారి వంతుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ దోమ జగదీష్ గారు ఇల్లూరు తిరుపాల్ బాబు గారు తెలుగుదేశం నాయకులు సోమిశెట్టి నవీన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి ఆర్యవైశ్య సంఘ నాయకులు నాగిళ్ల రాజగోపాల్ ఇల్లూరు సుధాకర్ వాయిగండ్ల సుబ్బారావు విట్టల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు