
పత్రికా ప్రకటన (14.04.2026)
KBR బార్ వద్ద జరిగిన గొడవలో మరో ఇద్దరు నిందితుల అరెస్ట్.
25.3.2026 తేదీన రాగమయూరి కమర్షియల్ స్ట్రీట్ లో గల KBR బార్ నందు పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ 3 rd year స్టూడెంట్ జాన్ వేస్లీ చనిపోవడం జరిగింది.
ఇందులో సుమారు 15 మంది మిత్రులు KBR బార్ నందు 25.3.2026 రాత్రి 9 గంటల సమయం లో రాఘవేంద్ర అతని మిత్రులకు మధ్య ఉన్న మనస్పర్థలు కారణంగా మద్యం సేవించి బార్ నుండి బయటికి వచ్చిన తర్వాత జరిగిన గొడవలో రాఘవేంద్ర అతని మిత్రులు కలిసి జాన్ వేస్లీ, అతని స్నేహితులైన ప్రవీణ్, నితీజ్ లను చేతులతోను పైప్ లతో కొత్తగా ప్రాణభయం తో వేస్లీ హైవే వైపు పారిపోగా, నిందితులు అతన్ని వెంబదించడం తో హైవే దాటుతూ ఒక బోలెరో వాహనం ఢీ కొట్టగా, వేస్లీ కి తీవ్రగాయాలు కలిగి కర్నూల్ ప్రభుత్వ ఆసువత్రి లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది.
దీనిపై నమోదైన culpable homicide, SC ST చట్టం కింద కేసు నమోదు పరచి, ధర్యాప్తు అధికారైనా శ్రీ ఉపేంద్ర బాబు డీస్పీ, 4th టౌన్ CI విక్రమ్ సింహ, SI చంద్ర శేఖర్ మరియు సిబ్బంది సహాయంతో నిందితులను సీసీటీవీ ఫుటేజ్ ల సహాయంతో గుర్తించి ఈరోజున మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద రాఘవేంద్ర, శశిధర్, సందీప్, జితేంద్ర, వర్ధన్ లను 31.3.2026 ణ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడమైనది.
ఇందులో ఫుటేజ్ ల ఆధారంగా మరి కొంత మంది నిందితులను గుర్తించి ఈరోజున రాజీవ్ నగర్ శాంతిరాజు రెడ్డి ని మరియు తులాసాపురం శ్రీకాంత్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడమైనది.
మరి కొంత మంది భాద్యులను కూడా అరెస్ట్ చెయ్యాల్సి ఉంది.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice