16/03/2026

*కైకలూరులో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కల్యాణ మండపం ప్రారంభం* ఏలూరు జిల్లా కైకలూరులో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ గారు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు, ఆర్యవైశ్య నాయకులతో కలిసి నేను పాల్గొన్నాను. ఆర్యవైశ్యులు వ్యాపార రంగానికే పరిమితం అవ్వకుండా రాజకీయాల్లోకి కూడా రావాలి. గడిచిన ఎన్నికల్లో 95 శాతం మంది ఆర్యవైశ్యులు కూటమికి మద్దతిచ్చారు. అందుకు తగ్గట్టుగానే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యుల కోసం ఎంతో చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో వైశ్యులకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. ఇక కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే దిశలో ముందుకు వెళ్తున్నాం. #KurnoolMLA #ministerindcomfood #Janamkosamebharath #Janamthobharath #Tgv_Bharath
Leave a comment